కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే మన దేశంలో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పలు వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఉత్పత్తి రంగం కుదేలు అవడంతో ఆ ప్రభావం వ్యాపారులపై తీవ్రంగా పడింది. ఇక సినిమా రంగం ఇప్పటికే ఘోరంగా దెబ్బతింది. సినిమా షూటింగ్ లు అన్నీ మూతపడ్డాయి. మాల్స్.. మల్టీఫ్లెక్స్లు అన్నీ థియేటర్లు అన్ని బంద్ అయ్యాయి. ఈ నష్టం కోట్లలో ఉండనుంది. ఇక సినిమా షూటింగ్ లు ఆపివేయడం తో టాలీవుడ్కు ఏకంగా ఈ రెండు నెలల్లో కలిపి నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం బుల్లితెరపై సైతం పడింది.
కరోనా దెబ్బకు ఇప్పుడు సీరియళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. జనతాకర్ఫ్యూ తర్వాత ఏకంగా దేశంలో లాక్డౌన్ ప్రకటించారు. దీంతో అన్ని భాషల్లో సీరియల్స్ షూటింగ్లు బంద్ అయిపోయాయి. దీంతో ఇప్పుడు సీరియల్స్ సైతం ప్రసారమయ్యే పరిస్థితి లేదు. సహజంగా ఏ సీరియల్ అయినా వారం పది రోజుల ఎపిసోడ్లు కూడా ముందుగానే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రసారానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు పది రోజుల ఎపిసోడ్లు కూడా టెలీకాస్ట్ అయిపోవడం.. ఇటు షూటింగ్లు బంద్ కావడంతో కొన్ని సీరియళ్ల ప్రసారాలు నిలిపి వేస్తున్నట్లు పలు టీవీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఈమేరకు టీవీల్లో స్క్రోలింగ్లు ప్రసారం చేస్తున్నారు.
తెలుగు బుల్లితెరపై పాపులర్ ఛానెల్స్ అయిన జెమినీ టీవీ, ఈటీవీ ఛానెల్స్ సీరియల్స్ ఈ వారంతంతో ముగియనున్నాయట. అటు జెమినీ ఛానెల్స్.. ఇటు ఈటీవీ వాళ్లు సీరియల్స్ ఆపేసి.. ఇప్పుడు వాటి స్థానంలో సినిమాలు ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కరోనా ప్రభావం తగ్గి మళ్లీ బుల్లితెర సీరియల్స్ షూటింగ్ లు ప్రారంభ మయ్యే వరకు అటు బుల్లితెర నటీనటులతో పాటు బుల్లితెర అభిమానులకు సైతం ఈ కష్టాలు తప్పేలా లేవు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple