తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సుస్థిర స్థానం సంపాదించారు. ఆయన బాటలో ఇప్పుడు పలువురు హీరోలుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాన్ లు వెండితెరకు పరిచయం అయినా నాగబాబు నిర్మాతగా కొనసాగుతూ వచ్చారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆయన నటుడిగానే కాదు.. రాజకీయ నేతగా పరిచయం. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.
మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వరుస ట్వీట్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ సందర్భంగా బాబాయి.. అబ్బాయి గురించి తెగ పొగిడేస్తున్నాడు. నేడు తనయుడు రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా చిరంజీవి ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. రామ్ చరణ్ నెలల పిల్లాడిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ఆశీర్వదిస్తూ అక్షింతలు చల్లుతుండడం ఆ ఫొటో ని షేర్ చేశారు చిరంజీవి. ఈ ఫోటో పై స్పందిస్తూ.. రామ్ చరణ్ చిన్న నాటి నుంచి బాబాయి అడుగు జాడల్లో నడుస్తున్నాడు. అందుకే తనకు సమాజ సేవపై కూడా ఎంతో మక్కువ ఉందని అంటున్నాడు. దాతృత్వంలో బాబాయినే ఆదర్శంగా తీసుకుంటాడు అన్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా బాధితులకు అండగా.. పవన్ కళ్యాణ్ రూ. 2కోట్లు ప్రకటించిన కాసేపటికే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కరోనా బాధితుల కోసం రూ. 70లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ట్విట్టర్కి దూరంగా ఉన్న రామ్ చరణ్.. లేటెస్ట్గా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు రామ్ చరణ్ @AlwaysRamCharan పేరుతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
.. ... ఆ వయస్సు నుంచే, బాబాయి foot steps follow అవ్వటం మొదలుపెట్టాడు. #HappyBirthdayRamcharan @PawanKalyan @AlwaysRamCharan pic.twitter.com/u4muca21bT
— chiranjeevi konidela (@KChiruTweets) March 27, 2020