టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర హీరోలు అందరూ కూడా కమర్షియల్ గానే ఆలోచించడం మొదలు పెట్టారు. సినిమా వస్తే అది కమర్షియల్ గానే ఉండాలి అనేది హీరోల ప్లాన్. చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా ఇదే ఆలోచనలో ఉంటున్నారు ఈ మధ్య కాలంలో దర్శకులు కథలు ఇచ్చినా సరే ఆ విధంగానే ఇవ్వాలి అనే డిమాండ్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెడుతున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం మహేష్ బాబు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గత నాలుగు సినిమాలు కూడా అదే విధంగా ఉన్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే. 

 

అయితే ఇప్పుడు ఈ విధానం చాలా మంది నిర్మాతలకు నచ్చడం లేదని అంటున్నారు. పరుశురాం తో మహేష్ బాబు చేసే సినిమాను తాను తీసుకోవాలని చూసాడు దిల్ రాజు. కాని మహేష్ బాబు చెప్పినవి విన్న తర్వాత ఆయనలో అసహనం పెరిగిందని అంటున్నారు. ప్రతీ ఒక్కటి మహేష్ బాబు కమర్షియల్ గానే ఆలోచించడం తో అందరూ షాక్ అవుతున్నారు. నిర్మాణ్ రంగంలోకి ఈ మధ్యనే అడుగు పెట్టాడు మహేష్ బాబు. మహా అంటే పది సినిమాలు కూడా చేయలేదు. కాని సీనియర్ నిర్మాతలకు అతను షరతులు పెట్టడం అనేది చాలా మందికి అసలు నచ్చడం లేదు. 

 

అందుకే దిల్ రాజు మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి అనే ప్లాన్ ఉన్నా సరే వెనక్కు తగ్గుతున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాబోయే సినిమాలు కూడా కమర్షియల్ గా ఉండే విధంగానే మహేష్ బాబు ప్లాన్ చేయడం తో దిల్ రాజు లో చికాకు కనపడుతుందని ఒకప్పుడు మహేష్ తో సినిమా అనగానే దిల్ రాజు లో ఒక హుషారు ఉండేది అని అది ఇప్పుడు కనపడటం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: