టాలీవుడ్ లో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ కూడా ఈ సినిమా మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. అగ్ర హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్సినిమా చేయడంతో ఈ సినిమా మీద బాలీవుడ్ నిర్మాతలు దర్శకులు కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే బాలీవుడ్ కూడా ఆసక్తికరంగానే వింటుంది. 

 

ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త కూడా ఇప్పుడు టాలీవుడ్ లో ఆ సినిమాకు సంబంధించిన హైప్ ని అమాంతం పెంచుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ సినిమా లో హీరోల ఫస్ట్ లుక్ నుంచి ప్రతీ ఒక్కటి కూడా అందరిని ఆసక్తికి గురి చేస్తుంది. ఇది పక్కన పెడితే ఈ సినిమాను ఇప్పుడు కొందరు టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ సినిమా మీద కొందరు అగ్ర ధర్శకులకే మంట ఉందని అంటున్నారు. ఈ సినిమాకు ముందు హీరోలు కొంత మంది దర్శకులతో సినిమాలు చెయ్యాలని చూసారు. కాని రాజమౌళి ఓకే చెప్పడం తో వారు ఆ సినిమాలను వదిలి పెట్టారు. 

 

ఇదే ఇప్పుడు కొందరికి అసలు నచ్చడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు కూడా ఇప్పుడు కొందరు ట్రిపుల్ ఆర్ సినిమా మీద దృష్టి పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రతీ చిన్న వార్త కూడా హైలెట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వార్త కూడా ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గాని ప్రచారం మాత్రం ఒక స్థాయిలో చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: