టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడిని వారు ఉండరు.. అందులో ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు చిన్న నాటి నుంచి హార్డ్ కోర్ ఫ్యాన్ అని.. చిరు మూవీస్ చూస్తూ పెరిగానని ఎన్నో సందర్భాల్లో చెప్పారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ ఇష్టంతోనే ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి మూవీ ‘చిరుత’ డైరెక్ట్ చేశారు. అయితే ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి తో ఓ మూవీ తీయలనే కోరిక తనకు ఉందన్న విషయం ఎన్నో సార్లు చెప్పారు. ఇక ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మాద్యమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానులతో టచ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
చిరంజీవికి సోషల్ మీడియాలో అపూర్వమైన స్పందన వచ్చింది. ఆనాటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ తాకిడి ఎంతగా ఉందో.. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియాలోకి ఆహ్వానం పలికారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా చిరంజీవికి వెల్ కం చెప్పారు. 'సోషల్ మీడియాలోకి స్వాగతం సార్. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తున్న తరుణంలో సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుంది' అని పోస్ట్ చేశారు.
దానికి మెగాస్టార్ చిరంజీవ స్పందిస్తూ.. థాంక్యూ పూరీ జగన్నాథ్. కరోనా కారణంగా మంచి ఫ్యామిలీ టైమ్ లభిస్తోంది. ముంబై, బ్యాంకాక్ బీచ్ లను నీవు మిస్ అవుతావేమో కానీ... పవిత్ర, ఆకాశ్ నీతో సమయాన్ని గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారని రిప్లై ఇచ్చారు. మొత్తానికి భవిష్యత్ లో పూరికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లే అనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ మూవీ తిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన మెగా హీరోతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.