మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ రౌద్రం రణం రుధిరం. మొన్న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన టైటిల్ మోషన్ వీడియోతో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. నిన్న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన రామరాజు లుక్ కు ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.

 

 

అయితే.. ఈ సినిమా రైట్స్ ను బాలీవుడ్ లో ఎవరికిచ్చారో ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రౌద్రం రణం రుధిరం హిందీ రైట్స్ ను ఈసారి కరణ్ జోహార్ కు ఇవ్వలేదని తెలుస్తోంది. నిజానికి బాహుబలికి బాలీవుడ్ తో పాటు ఇండియావైడ్ క్రేజ్ రావటానికి ముఖ్య కారకుడు కరణ్ జోహార్. రాజమౌళి ప్లానింగ్ కి కరణ్ జోహార్ మార్కెటింగ్ టెక్నిక్స్ తోడై బాహుబలిని దేశవ్యాప్తంగా నిలబెట్టారు. దీంతో రాజమౌళి, కరణ్ జోహార్, నిర్మాతలు అందరూ లాభపడ్డారు. కానీ ఈసారి కరణ్ జోహార్ కి ఇవ్వలేదని అంటున్నారు.

 

 

బాహుబలి2 ను హిందీలో కరణ్ జోహార్ తో కలిసి రిలీజ్ చేసిన ఏఏ ఫిలింస్ కు మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏఏ ఫిలింస్ అధినేత అనిల్ తడాని బాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ రవీనాటాండన్ భర్తే అనిల్ తడాని. ఆర్ఆర్ఆర్ ను అనిల్ సొంతంగా రిలీజ్ చేస్తున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కు మాత్రం బాలీవుడ్ లో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. నిజానికి కరణ్ ను రాజమౌళి దూరం పెట్టే పరిస్థితి లేదు. దీనిపై రియల్ న్యూస్ నిర్మాత దానయ్య రివీల్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: