మీరా జాస్మిన్...కెరీర్ ప్రారంభించిన దగ్గర నుండి ఎక్స్‌పోజింగ్ చెయ్యకుండా కెరీర్ ముగించిన అతి తక్కువ మందిలో మీరా ఒకరు. ఎంత క్రేజ్ వచ్చినా మీరా జాస్మిన్ ఎప్పుడూ గ్లామర్ షో పాత్రలు వేయలేదు. ఆ తరహా పాత్రలకు మీరా పూర్తిగా వ్యతిరేకం. స్వతహాగా మలయాళీ అయిన మీరా జాస్మిన్ సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా అలరించింది. చీర కట్టులో ఆమె అందానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యే వారు. హీరోయిన్ అంటేనే ఎక్స్‌పోజింగ్ చేయాలి అని ఫార్ములాను బ్రేక్ చేసి సినీ ఇండస్ట్రీలో కొనసాగినన్ని రోజులూ కేవలం నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనే నటిస్తూ అందరి మనసుల్ని దోచుకుంది. సౌదర్య తర్వాత స్కిన్ షో చేయకుండా చిత్ర పరిశ్రమలో నెట్టుకొచ్చిన హీరోయిన్ మీరా మాత్రమే అని చెప్పవచ్చు.


మీరా జాస్మిన్ 'అమ్మాయి బాగుంది' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగు వారిని మీరా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మీరాకు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఆవకాశం కొట్టేసింది ఈ భామ. 'గుండుంబా శంకర్' చిత్రంలో పవన్ కళ్యాణ్, మీరాజాస్మిన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తరువాత మీరా జాస్మిన్ రవితేజ సరసన 'భద్ర' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మీరా అద్భుత నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ కు భద్ర చిత్రం చాలా చిరస్మరణీయమైనది. రవితేజ కూడా తన కెరీర్ లో బెస్ట్ మూవీగా 'భద్ర' పేరే చెబుతాడు.

 

అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన దేహంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొంత కాలంగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ తన కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. చాలా కాలం పాటు మీరా టాప్ హీరోయిన్ల లీగ్ లో కొనసాగింది. 2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: