హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన హీరో నిఖిల్ ఆ తర్వాత యువత సినిమాతో ఓ మోస్తారు విజయం అందుకుని స్వామిరారా చిత్రంతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. స్వామిరారా తర్వాత కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఆ తర్వాత సంవత్సరం పాటు డిలే అయిన అర్జున్ సురవరం చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం  పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్న హీరో 18పేజేస్ అనే చిత్రంలో నటించబోతున్నాడు.

 

 

సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఓ చిత్రాన్ని కుమారి 21 ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ సమకూర్చిన కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమం జరుగిపోయింది. గీతా ఆర్ట్స్య్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం పట్ల ఒకరకమైన ఆసక్తి నెలకొంది. అంతే కాదు సుకుమార్ కథ రాసాడంటే ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉండే ఉంటుందని నమ్ముతున్నారు.

 


అయితే ఈ కథలో నిఖిల్ మెమరీ లాస్ పేషంట్ గా కనిపిస్తాడట. మెమరి లాస్ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా కొద్ది సినిమాలే వచ్చాయి. అయితే ఆ సినిమాల విజయాల శాతం కూడా తక్కువే. మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా చిత్రం ఇలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చినప్పటికీ, ఆ సినిమా వచ్చిన టైమ్ లో కాన్సెప్ట్ చిత్రాల హవా ఎక్కువ లేకపోవడంతో ఫ్లాప్ ని మూటగట్టుకుంది.

 

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగులో చాలా విభిన్నమైన చిత్రాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల ఆదరణ కూడా బాగానే ఉంటుంది. అదీ గాక సుకుమార్ రైటింగ్స్ లో వస్తుండడంతో ఖచ్చితంగా హిట్ సినిమానే అవుతుందని నమ్ముతున్నారు. ఈ చిత్రంలో ఉప్పెనతో తెలుగు తెరకి పరిచయం అవుతున్న కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: