టాలీవుడ్ లో వారసులలో చాలా విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న వాళ్లలో మంచు బ్రదర్స్ ఒకరు. గత కొన్నేళ్ళుగా వీరి ఖాతాలో అసలు హిట్లే లేవు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ నేపథ్యంలో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ అన్నాదమ్ములు. మంచు విష్ణు మోసగాళ్ళు అనే భారీ చిత్రాన్ని తెలుగుతో సహా హాలీవుడ్ లోనూ తెరకెక్కిస్తున్నాడు.

 

 

మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఈ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మంచు విష్ణు ఒకానొక ఇంటర్వ్యూలో  తన సినిమా జీవితంలోని ఒడిదొడుకులని బయట పెట్టాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలని బయట పెట్టాడు. దాన్లో ఆచారి అమెరికా యాత్ర సినిమా గురించి మాట్లాడాడు.

 

ఈ సినిమాకి ముందుగా అనుకున్న కథ వేరని, అమెరికా వెళ్ళాక పూర్తిగా కథ మారిపోయిందని, ఈ విషయంలో డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డిని నిలదీశానంటూ పేర్కొన్నాడు. ఆచారి అమెరికా యాత్ర విష్ణు కెరీర్లో ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఇంకా ఒకానొక చిత్రంలోని రషెస్ చూసినప్పుడే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందన్న సంగతి తెలిసిపోయిందని తెలిపాడు. కానీ అది ఏ సినిమా అన్నది మాత్రం తెలియలేదు. ఓటర్ సినిమా టైమ్ లో జరిగిన వివాదాలను బయటపెట్టాడు.

 


జస్ట్ ప్రోమోలోనే ఇన్ని సంచలన విషయాలు బయటపడితే ఇంటర్వ్యూలో ఇంకెన్ని సంచలన విషయాలు ఉంటాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్వ్యూ మొత్తం రిలీజ్ అయితే గానీ తెలియదు మంచు విష్ణు ఏ విషయాలు బయటపెట్టాడో..అలాగే శ్రీనువైట్లతో ఢీ సినిమాకి సీక్వెల్ ఉంటుందా లేదా అన్న విషయం కూడా చెప్పినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: