మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన అతని శిస్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజైన పాటలు మంచి ఆదరణ పొందుతాయన్నాయి. ముఖ్యంగా ఈ పాటల్లో కనిపించిన హీరోయిన్  కి మార్కులు పడ్డాయి. దీనితో ఆమెకి సినిమా విడుదల కాకముందే అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి నిర్మాతలు ఇప్పటి దాకా 22 కోట్లు ఖర్చు చేసారని సమాచారం. అంతేకాకుండా కొత్త డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా కోసం 5 గంటల ఫుటేజీ షూట్ చేసాడంట. రషెస్ చూసిన సుకుమార్ చాలా ఎపిసోడ్స్ ట్రిమ్ చేయమని సలహా ఇచ్చాడంట. సినిమా నిడివి 2 గంటల 30 నిముషాలు ఉంటే సినిమాకు మంచిదని భావించి తనే దగ్గరుండి ఈ సినిమా ఎడిటింగ్ పనులు చేసుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కాపీ ఈ నెల చివరికి రెడీ అయ్యే అవకాశం ఉందంట.

 

కరోనా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ పరిస్థితిలు సర్దుమరిగిన తర్వాత చిత్రాన్ని రిలీజ్ చేయానికి చిత్ర యూనిట్ ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో వారసుడు కావడంతో మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: