వడివేలు భారతీయ హాస్యనటుడిగానే కాకుండ మంచి గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభుదేవతో ప్రేమికుడు చిత్రంలో వడివేలు చేసిన కామెడీ అంతా ఇంతాకాదు. కమెడియన్ కొనసాగుతూనే హీరోగా నటించాడు. హంసించే 23వ రాజు పులకేశి చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. గత కొంత కాలంగా ఆయనపై కొన్ని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. తాజాగా తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే వడివేలు జనాల తీరుని చూసి భావోద్వేగానికి గురయ్యారు. నేను మనోవేదనకి గురవుతున్నా.
ప్రభుత్వాలు చెప్పింది విని కొద్ది రోజుల పాటు ఇంటి పట్టున ఉందాం. కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో దానిని ఎలా కట్టడి చేయాలో తెలియక ప్రభుత్వాలు ఆందోళనకి గురవుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉంటామని ప్రభుత్వాలు గొంతెత్తి చెబుతున్నా, ప్రజలు మాత్రం యదేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు. కాస్త ఉన్నవాళ్లు ఇండ్లలో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లేని వారు దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు, వ్యాపారస్తులు నానా కష్టాలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌౌన్ చేయడంలో దేశం అంతా స్థంబించి పోయింది.
దయచేసి వారికి సహకరిద్ధాం. పోలీసులు కూడా బ్రతిమిలాడడం చూస్తున్నా. దయచేసి ఎవరు బయటకి రాకండి. బిడ్డా పాపలతో ఇంట్లోనే హాయిగా ఉందాం. ఎవరు దీనిని తేలికగా తీసుకోవద్దు అంటూ వడివేలు ప్రజలకి బాధాతప్త హృదయంతో విన్నవించారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ ప్రభావంతో విల విలలాడుతుంది. కరోనా అదుపులోకి వచ్చే వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతూన ఉంటుందని అంటున్నారు. మరోవైపు కరోనా భయంతో జనాలు ఇంటిపట్టునే ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ కరోనా మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటికే 19 వరకు మరణాలు సంబవించాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple