కుమారి 21ఎఫ్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన భామ హెబ్భా పటేల్.. మొదటి సినిమా అలా ఎలా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలియదు కానీ కుమారి 21ఎఫ్ తో దుమ్ముదులిపేసింది. ఆ సినిమాతో అమ్మడు యూత్ ఆడియెన్స్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. లిప్ లాక్స్, గ్లామర్ షోలో అమ్మడి రూటే సెపరేట్ అనేలా చేసింది. సూర్య ప్రతాప్ డైరక్షన్ లో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాతో హెబ్భా పటేల్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 

 

కుమారి సినిమాతో పాపులర్ అయిన హెబ్బా పటేల్ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను తర్వాత సినిమాల్లో కొనసాగించలేకపోయింది. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతుంది అమ్మడు. ఈమధ్య ఆహా యాప్ కర్ టన రైజర్ ఎపిసోడ్ లో కూడా హెబ్భా పటేల్ దుమ్ముదులిపేసే అందంతో ఆకట్టుకుంది. యూత్ ఆడియెన్స్ టార్గెట్ తో అమ్మడు చేసే అందాల ప్రదర్శన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కుమారి 21ఎఫ్ తర్వాత ఒక ఊపు ఊపేస్తోంది అనుకున్న హెబ్భా పటేల్ సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక కెరియర్ లో వెనుకపడ్డది. 

 

ప్రస్తుతం ఆహా యాప్ లో మస్తీ వెబ్ సీరీస్ లో నటించిన ఈ అమ్మడు వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. గ్లామర్ షో విషయంలో దర్శకులకు ఏమాత్రం అడ్డు చెప్పని హెబ్భా ఒక మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నా సరే అమ్మడు మాత్రం కెరియర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడంలో వెనుకపడ్డది. మరి హెబ్భా పటేల్ కు ఇక మీదట అయినా మంచి ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ఈసారి ఛాన్స్ వస్తే మాత్రం తన అందంతో కట్టిపడేయాలని గట్టిగా ఫిక్స్ అయింది హెబ్భా పటేల్ మరి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: