టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకుని ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మొదట్లో సినిమా పరిశ్రమకు ఎన్నో వ్యయప్రయాశలతో అడుగుపెట్టిన ఈ ఇద్దరు నటనలు, మెల్లగా అప్పట్లో తమకు వస్తున్న అవకాశాలను వినియోగిచుకుని అనతికాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు. చిరంజీవి మెగాస్టార్ గా గొప్ప పేరు గడిస్తే, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో నటప్రపూర్ణ గా మోహన్ బాబు పేరు దక్కించుకోవడం జరిగింది. ఇక ఈ ఇద్దరూ కూడా మొదటి నుండి మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇద్దరి ఫ్యామిలీలు కూడా పలు సందర్భాల్లో, శుభకార్యాల్లో ఒకరి వేడుకలకు మరొక హాజరవడంతో పాటు ఒకరి ఇంటికి మరొకరు సరదాగా వస్తూపోతూ ఉంటారు కూడా. 

 

అంత గొప్ప అనుబంధం మెగాస్టార్, మోహన్ బాబుల మధ్య ఉంది. అయితే వీరిద్దరి మధ్య కొద్దిపాటి బేధాభిప్రాయాలు ఉన్నట్లుగా కొన్ని వార్తలు ప్రచారం అయినప్పటికీ, అవన్నీ కూడా ఒట్టి పుకార్లే అని తేలిపోవడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తమ తమ ఇళ్లకే పూర్తిగా పరిమితం అయిన ఈ ఇద్దరు నటులు, తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒకరిపై మరొకరు సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల్లో మెగాస్టార్ అకౌంట్స్ ఓపెన్ చేయడంతో, వెల్కమ్ మిత్రమా అంటూ మోహన్ బాబు ట్వీట్ చేయగా, రాననుకున్నావా రాలేననుకున్నావా అంటూ మెగాస్టార్ ఆయన ట్వీట్ ని ఫన్నీ గా రీట్వీట్ చేసారు. 

 

దానికి బదులిచ్చిన మోహన్ బాబు, ఈసారి నిన్ను కలిసి హగ్ చేసుకున్నప్పుడు ఆ విషయం చెప్తాను అని మోహన్ బాబు చేసిన ట్వీట్ కి బదులిచ్చిన మెగాస్టార్, ప్రస్తుతం కరోనా మాగమ్మరీ ప్రభావం వలన ఇకపై షేక్ హాండ్స్, హగ్స్ వంటివి వద్దు, చక్కగా మన సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి నమస్కారం పెడదాం, ఈ మహమ్మారి నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన లక్ష్మి ప్రసన్న పోస్ట్ చేసిన వీడియో చూడు అంటూ రీట్వీట్ చేయడం జరిగింది. అయితే కాసేపటి క్రితం మెగాస్టార్ రీట్వీట్ పై స్పందించిన లక్ష్మి ప్రసన్న, మెగాస్టార్ నా వీడియోని ఎండార్స్ చేయడం ఆనందంగా ఉంది. నాన్నా మీ మిత్రుడు నా ప్రక్కనున్నారు, మా ఇద్దరి బంధం చేప, నీరు వంటిది అంటూ ట్వీట్ చేయడం జరిగింది....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: