ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎంటైర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రౌద్రం రణం రుధిరం. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు నిన్న రామ్ చరణ్ బర్త్ డేని పురస్కరించుకుని, సినిమాలో ఆయన పోషిస్తున్న అల్లూరి పాత్ర పరిచయ వీడియోని మరొక నటుడు, కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ తో రిలీజ్ చేయించారు. ఇక ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ తో దుమ్మురేపుతోంది. 

IHG

మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు పలువురు సాధారణ ప్రేక్షకులు సైతం ఆ వీడియోపై అలానే మోషన్ పోస్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం లాకౌట్ కారణంగా మిగతా అందరి మాదిరిగా పూర్తిగా ఇంటికే పరిమితం అయి తన కుటుంబంతో కలిసి గడుపుతున్న దర్శకుడు రాజమౌళి, కాసేపటి క్రితం ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ కు ప్రత్యేకంగా తన ఇంటి నుండి ఫేస్ టూ ఫేస్ వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. 
అయితే ఆ ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమంలో అల్లూరి, భీం పాల్గొనడానికి ముందు వారిద్దరూ కూడా కొన్నాళ్ళు తమ తమ కుటుంబాల వద్దకు వెళ్లిన అనంతరం, వారి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, ఆ తరువాత తిరిగి వచ్చిన తరువాత ఒకానొక సందర్భంలో కలిసిన ఆ ఇద్దరూ కూడా ఉద్యమంలో పాల్గొని యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అంటూ కొత్త కల్పిత గాధకు మరికొంత వాస్తవం జోడించి ఈ సినిమాని తీస్తున్నట్లు చెప్పారు.

 

ప్రస్తుతం రిలీజ్ అయిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కు అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని, ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు రాజమౌళి. అయితే ప్రస్తుతం లాకౌట్ నడుస్తుండడంతో తమ టీమ్, వర్క్ ఫ్రమ్ చేస్తోందని, ఇప్పుడున్న ఈ కరోనా ఎఫెక్ట్ ముగిసిన తరువాత తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేస్తామని, అవకాశం ఉన్నంత వరకు సినిమాని వచ్చే ఏడాది అనుకున్న విధంగా రిలీజ్ చేస్తాం అని రాజమౌళి అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: