కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న దేశానికి, చాలా మంది తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్ తదితరులు తమ విరాళాన్ని ప్రకటించారు. కాని వారందరికంటే, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ విషయంలో సంచలనం సృష్టించాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఈ సూపర్ స్టార్ ఏకంగా 25 కోట్ల విరాళం అందించాడు.

 

 

ఇప్పటి వరకు భారతదేశంలో ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా అందించిన సీలెబ్రిటీ మరొకరు లేరు. ఈయన సాయాన్ని చూసి అందరూ అవాక్కవుతున్నారు. కరోనా రక్కసిపై ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించడమే కాకుండా, 25 కోట్ల రూపాయలను తన వంతుగా ప్రభుత్వానికి ఇస్తున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అక్షయ్ కుమార్ ప్రకటించాడు.

 

 

 

 

అందులో "ఇది మన మనుషులు ప్రాణాలకు సంబంధించిన విషయం.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నా వంతుగా 25 కోట్లు విరాళంగా అందిస్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్నాను" అని తెలిపారు. ఆయన గొప్ప మనసుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒక్కడే విరాళం అందించాడు. ఈయన సాయం చూసి అంతా నువ్వు రియల్ హీరో అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి ఈయన స్పూర్థితో బాలీవుడ్ నుండి ఇంకెంతమంది కదలి వస్తారో చూడాలి మరి...

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: