ప్రపంమంతా కూడా ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాధి పట్ల తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడ్డ ఎందరో ప్రజల్లో కొందరు మృత్యువాత పడగా, మరికొందరు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ కరోనా వ్యాధి మరింతగా ప్రబలకుండా ఉండేందుకు మిగతా దేశాల మాదిరిగా మన దేశాన్ని కూడా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాకౌట్ వలన ఎందరో మధ్య, దిగువతరగతి వర్గాల ప్రజలు పూర్తిగా తమ ఇంటివద్దనే ఉండిపోవలసి రావడంతో వారి జీవనం కష్టంగా మారింది. 

 

అయితే అది గ్రహించిన మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వారిని ఆదుకోవడానికి కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. కాగా దానితో పాటు మేము కూడా మాకు వీలైనంత సాయం అందిస్తాం అంటూ దేశవ్యాప్తంగా ఉన్న పలు సినిమా ఇండస్ట్రీల సినిమా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అయితే అందులో భాగంగా ఇప్పటికే మన టాలీవుడ్ నుండి పలువురు నటీనటులతో పాటు దర్శకులు సహా మరికొందరు ఎవరికి వీలైనంత సాయం వారు అందించారు. అయితే మన టాలీవుడ్ లో అత్యధికంగా రెబల్ స్టార్ ప్రభాస్ రూ.4 కోట్ల విరాళాన్ని ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. 

ఇక నేడు కాసేపటి క్రితం బాలీవుడ్ దిగ్గజ నటుడు అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి కేర్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అక్షయ్ ప్రకటించడం జరిగింది. అయితే అక్షయ్ ప్రకటనతో ఒక్కసారిగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనపై పొగడ్తలు విపరీతంగా కురుస్తున్నాయి. రీల్ మీద కనపడే వాడే కాదు, మీలాగా ప్రజలను ఇంత గొప్ప హృదయంతో కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం రియల్ హీరోయిజం, వారెవ్వా శభాష్ అంటూ పలువురు నెటిజన్లు అక్షయ్ పై ప్రశంసలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: