ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో మన భారత్ పోరాడుతుంది.. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించి మనిషి ప్రాణాలు తీస్తుంది. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఆరు లక్షల మంది ఆ వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇంకా అలాంటి ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 30 వేలమంది మృతి చెందారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ మన దేశంలో ఎక్కువ వ్యాప్తి అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దేశమంతా కూడా 21 రోజులపాటు లాక్ డౌన్ చేశారు. దీంతో దేశ ప్రజలంతా కూడా ఎవరి ఇంటికి వారు పరిమితం అయ్యారు. అలా కాకుండా లాక్ డౌన్ ను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఈ కరోనా వైరస్ కారణంగా మన భారత్ ఆర్ధిక వ్యవస్ద ఎంత దారుణమైన స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ పై పోరాటానికి ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు.. బిజినెస్ మ్యాన్స్, సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, సామాన్యులు అందరూ కూడా వారికీ తోచినంత సాయం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ భారీ విరాళం ప్రకటించగా ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం భారీగా విరాళం ప్రకటించింది.
సినీ కార్మికులు, హెల్త్ వర్కర్స్ కోసం దగ్గుబాటి కుటుంబం భారీ విరాళాన్ని ప్రకటించింది. సినీ పరిశ్రమపైనే ఆధారపడి జీవితాన్ని సాగిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని సురేష్ ప్రొడెక్షన్స్ బ్యానర్ తరుపు నుండి దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేశ్, రానా రూ.కోటి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple