సినీ ఇండస్ట్రీలో క్రేజీ కంబినేషన్లకు కొదవుండదు. ఇంక మన టాలీవుడ్ కి వస్తే ఇవి చాలా ఎక్కువే. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' పూర్తి చేసిన తర్వాత పట్టాలెక్కనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా థమన్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ జోషులో ఉన్న సంగీత దర్శకుడు ఎవరంటే తమనే. వరుస హిట్ సినిమాలతో తన కెరీర్లోనే పీక్ స్టేజిలో ఉన్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాకముందే రాజమౌళి- రామారావు- రామ్ చరణ్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్' ట్యాగ్ తరహాలో... త్రివిక్రమ్- తారక్- తమన్ పేర్లను ప్రతిబింబించేలా సోషల్ మీడియాలో అభిమానులు 'టి.టి.టి' అనే ట్యాగ్ లైన్ జత చేస్తున్నారు.

 

రాజమౌళి మల్టీస్టారర్ కి వచ్చినంత క్రేజ్ తమ హీరో సినిమాకి కూడా రావాలని తెగ ప్రయత్నిస్తున్నారు అభిమానులు. అయితే ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇంతకముందే 'అరవింద సమేత..వీర రాఘవ' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ముగ్గురు 'టి' లు కలవబోతున్నాయన్నమాట. అంటే డబల్ ట్రిపుల్ 'టి'అన్నమాట. ఇదే కనుక నిజమైతే వీరు ముగ్గురు మరోసారి బాక్సాఫీస్ షేక్ అయినట్లే. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్ర షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

 

ఏదేమైనా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం 'ఆర్.ఆర్.ఆర్' గురించి ఆలోచిస్తున్న ఈ సమయంలో మరోసారి 'టి.టి.టి' కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ టైటిల్ గా 'రౌద్రం రణం రుధిరం' ఫిక్స్ చేశారు. అన్ని భాషల్లోనూ టైటిళ్లను రివీల్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు ఈ టైటిల్ కు తగినట్టుగా అల్లూరి సీతారామరాజు రౌద్రం చూపిస్తూ నిప్పు కనికలా రామ్ చరణ్ పరుగెత్తుకు వస్తుండగా.. నీటితో రుధిరం అంటూ ఎన్టీఆర్ కనిపించాడు. ఈ ఇద్దరు చేసే రణంగా 'ఆర్.ఆర్.ఆర్' వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: