టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘అరుంధతి’ మూవీ లో ఓసెయ్ బొమ్మాళీ అంటూ తనదైన విలనీజాన్ని చూపించిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు.  పూరి జగన్నాథ్ సూపర్ సినిమాతో నాగార్జున, సోనూ సూద్ మంచి విజయం అందుకున్నారు.  ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వల్ల లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. 

 

 

ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.   కొంతమంది స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటే మరికొందరు పూర్తిగా పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తున్నారు.దాంతో సినీ నటులు ఇంటి పట్టున ఉంటే తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు.  కొంత మంది వంటలు వండుతుంటే.. కొంత మంది మ్యూజిక్ తో సంతోషంగా గడుపుతున్నా. మరికొంత మంది జిమ్ లో గడుపుతున్నారు.  తాజాగా తన జిమ్ లో తన కొడుకుతో కండలు పెంచే పనిలో పడ్డాడు సోనూ సూద్.   

 

 

తాజాగా సోనూసూద్ కూడా తన లాక్ డౌన్ టైంను చాలా బిజీగా గడుపుతున్నాడు. అది ఎలా అంటే.. కొడుకు ఇషాంత్ సూద్ తో కలిసి కండలు పెంచే పనిలో ఉన్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ మెయింటెన్ చేసే సోనూ సూద్ తన కొడుకుతో కూడా ఈ టైంలో ఎక్కువ శాతం వర్కౌట్స్ చేయిస్తున్నాడట.   అయితే కరోనా వైరస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేషెంట్లకు ఆదుకునేందుకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.  ఇక సీఎం, సీఎం రిలీఫ్ ఫండ్ కి పెద్ద ఎత్తున డొనేట్ చేస్తున్న సినీ నటులు కూడా ఉన్నారు.  దేశంలో కరోనా కేసుల సంఖ్య 900 దాటిపోయింది.  20 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ తండ్రి కొడుకుల బాడీ బిల్డింగ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: