కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 

 


ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వారి లోని సృజాత్మకతను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..

 

 

 

ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ' వ‌కీల్‌సాబ్‌’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు బంద్‌ అయిన నేపథ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన సినిమా ఎడిటింగ్ చూస్తోన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు సినిమా డబ్బింగ్ పనులను చూస్తున్నట్లు తెలుస్తోంది..ఈ సినిమాలో లాయర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు.. నివేదా థామస్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది . అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 15 న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: