కరోనా వైరస్(కోవిడ్-19) వారు వీరు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని నానా ఇబ్బందులు పెడుతున్నది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో వేలమంది మరణించారు. ఇక దీని బారి పడి చికిత్స పొందుతున్న వారు లక్షల్లో ఉన్నాయి. అయితే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కూడా ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. లండన్ నుంచి వచ్చిన ఆమె ఎయిర్ పోర్ట్ లో తన ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టి ఫ్యామిలీ పార్టీలో హాజరైంది. దీంతో ఆమెను లక్నో నగరంలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే కనికా కపూర్కు ఇప్పటికే మూడు సార్లు కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. నాలుగోసారి కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ``కనికా 10 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా బారి నుంచి బయటపడడం లేదు. దీనిని బట్టీ ట్రీట్మెంట్కు కనికా స్పందించడంలేదని అర్థమవుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను విదేశాలు కూడా తీసుకెళ్లలేం. ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేం’’ అని కనికా కుటుంబసభ్యుల్లో ఒకరు తెలిపారు.
మరోవైపు కనికా పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఇటీవల లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆమె.. అధికారుల వద్ద ఆ విషయాన్ని దాయడంతోపాటు సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా పలు పార్టీలకు హాజరై ప్రముఖులను కలిసింది. కనికాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే వారంతా ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. కనీస నియమాలు పాటించకుండా ఆమె ఇతరులు ప్రమాదకరంగా మారడంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle