మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో దాదాపుగా అందరూ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇక కాస్తో కూస్తో కొంచం డల్గా ఉన్నారంటే అది ఒక్క మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాస్త స్లో అయ్యారు. అయితే ఆయన కూడా ఇటీవలె నటించిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన `ప్రతిరోజు పండగే` చిత్రంతో విజయం సాధించారని చెప్పాలి. మరి ప్రస్తుతం ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన`. మరి ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నాడు. ఆయన శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే వైష్ణవ్ తేజ్ కొంచం మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు సమాచారం. ఓ జాలరి ప్రేమకథగా కొత్త పంథాలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ అనూహ్యంగా ప్రబలుతుండటంతో రిలీజ్ని వాయిదా వేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇళ్ళకే పరిమిత మయిన సంగతి తెలిసిందే. దీంతో కాస్త ఖాళీ దొరకడంతో మన లెక్కల మాస్టారు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇక పూర్తి మార్పులు వచ్చాక అంటే మే 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ లోపు చాలా సమయం వుండటంతో సినిమా చూసిన సుకుమార్ కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. లాక్ డౌన్ ప్రకటించిన దగ్గరి నుంచి సుకుమార్ ఎడిటింగ్ రూమ్కే పరిమితం అయిపోయారని, ఎక్కడ ట్రిమ్ చేస్తే బాగుంటుందో అక్కడ కత్తెరేయడం మొదలుపెట్టారని సమాచారం.
ఒక కొత్త హీరోని నమ్మి ఈ సినిమాకు మేకర్స్ 22 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. దీంతో ఇంత మొత్తం చెల్లించి సినిమాని కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రాకపోవడంతో మైత్రీ మూవీమేకర్స్ వారే ఓన్ రిలీజ్కు రెడీ అయిపోయారట. కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు కాబట్టి అందుకు ముందడుగు వేసుంటారు. ఇక ఇదిలా ఉంటే... మరి వారి పెట్టుబడిని `ఉప్పెన` తిరిగి తెచ్చిపెడుతుందా? అన్న`దే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సినిమా కరోనా ఎఫెక్ట్తో కాస్త లేటయింది కాబట్టి వేచి చూద్దాం ఏం జరుగుద్దో.