మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన పింక్ తమిళ్ లో అజిత్ కుమర్ నటించడు. తాజాగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్రాజు, బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో వవన్ కళ్యాన్ నటిస్తున్న ఈ మూవీకి వకీల్ సాబ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది అతలా కుతలం చేస్తుంది. కరోనా వైరస్ వల్ల సినిమా లు అన్నీ క్యాన్సల్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ షూటింగ్ కూడా క్యాన్సల్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ పూర్తి చేసే లోపు కరోనా వైరస్ ప్రభావంతో సినిమా ఆగింది. సినిమాను మే 15న విడుదల చేయాలనుకుంటున్నారు. కరోనా వైరస్ వల్ల వచ్చిన ఈ గ్యాప్ను ‘వకీల్సాబ్’ టీమ్ ఉపయోగించుకుంటుందట. లాక్డౌన్ నేపథ్యంలో షూటింగులు బంద్ అయిన నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తయిన సినిమా ఎడిటింగ్ చూస్తోన్న పవన్ కల్యాణ్ ఈ సినిమాలో డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తేనే లాక్ డౌన్ ఎత్తివేయగానే మిగిలిన పార్ట్ను త్వర త్వరగా పూర్తి చేసి అనుకున్న టైమ్లో విడుదల చేసే అవకాశం ఉంటుందని యూనిట్ భావిస్తుందట.
తెలుగు లో వకీల్ సాబ్ మాత్రమే కాదు మరిన్ని సినిమాలు షూటింగ్స్ క్యాన్సల్ అయిన నేపథ్యంలో ఓకేసారి షూటింగ్స్ మొదలు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు లాక్ డౌన్ చేసినా కొన్ని చోట్ల దాన్ని ఉల్లంఘిస్తున్నట్లు సమాచారం. దాంతో కొత్త కేసులు పుట్టుకు వస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో సినీ తారలంతా తమ ఇళ్లకే పరిమితం అయ్యారు.