ప్రస్తుతం కరోనా వ్యాధి దెబ్బకు అన్ని దేశాలు కూడా ఎంతో భయంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధిని త్వరితగతిన తరిమికొట్టాలంటే ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లకు పరిమితం కావాలని ఇప్పటికే పలు దేశాలు పూర్తిగా లాకౌట్లు ప్రకటించాయి. ఇక మన దేశాన్ని కూడా మరొక 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని ఇటీవల ప్రకటించారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ప్రధాని పిలుపు మేరకు ఒక రోజు జరిగిన జనతా కర్ఫ్యూ ఎంతో విజయవంతం అయింది. 

 

అయితే దాని అనంతరం 21 రోజులు ఈ లాకౌట్ ప్రకటించడంతో కొందరు ప్రజలు నిత్యావసరాలు, అలానే పలు వైద్య అవసరాల నిమిత్తం తప్పనిసరిగా బయటకు రావలసి వస్తోంది. సాధ్యమైనంతవరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని ప్రధాని మోడీ సహా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, అధికారులు ప్రజలకు ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అందరం కలిసి పక్కాగా సామజిక దూరం పాటిస్తే తప్పకుండా అతి త్వరలో కరోనా మననుండి దూరం అవుతుందని సూచిస్తున్నారు. 

 

ఇక నేడు టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కలిసి కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అలానే సామాజికంగా దూరంగా పాటించాలని కోరుతూ ఒక వీడియో ని రిలీజ్ చేసారు. సంగీత దర్శకుడు కోడి కంపోజ్ చేసిన ఈ వీడియోలో ఈ నలుగురు హీరోలతో పాటు కోటి కూడా కనపడతారు. మంచి మెసేజ్ తో ప్రజలను కరోనా మహమ్మారి పట్ల ఏవిధంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలో ఎంతో అర్ధవంతంగా రాయబడిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అదరగొడుతోంది. పలువురు ప్రజలు, ప్రముఖులు ప్రస్తుతం ఈ పాటకు ఎంతో ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: