సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమాని గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్నడని తాజా సమాచారం. మహేష్ బాబు పరశురామ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ని అధికారకంగా త్వరలోనే వెల్లడించనున్నారు. వాస్తవంగా సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లి తో సూపర్ స్టార్ సినిమా సెట్స్ మీదకి వెళుతుందనుకున్నారు. అంతేకాదు దసరా లేదా దీపావళి కానుకగా రిలీజ్ కూడా అవుతుందనుకున్నారు. కాని వంశీ పైడిపల్లి చెప్పిన కథ సూపర్ స్టార్ కి నచ్చక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత వంశీపైడిపల్లి మరొక కథ తీసుకు వచ్చి మహేష్ బాబు కి చెప్పినప్పటికి అది పూర్తి గా లేకపోవడం తో తన నెక్స్ట్ సినిమా ఏంటనేది డైలమాలో ఉంది. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా ని పరశురామ్ కమిటయ్యాడు.

 

కీర్తి సురేష్ ఒకవైపు 'మహానటి' లాంటి సినిమాలలో నటిస్తూనే మరోవైపు 'అజ్ఞాతవాసి' లాంటి కమెర్షియల్ సినిమాల్లో నటించింది. ఈ చిత్రం తర్వాత నితిన్ తో రంగ్ దే సినిమాను చేస్తుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం. ఈ సినిమా కోసం డైరెక్టర్ పరశురామ్ మహేష్ బాబుతో ఇప్పటివరకు నటించని హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట. 

 

అందుకే ఈ సినిమా నిర్మాతలు కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారని అంటున్నారట. కరోనా ప్రభావ పరిస్థితులను బట్టి పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు - కీర్తి సురేష్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్.. రజినీకాంత్ సరసన ఒక చిత్రం - తెలుగులో 'మిస్ ఇండియా' - తమిళంలో 'పెన్ గ్విన్' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన 'మైదాన్' సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో ఇదే కీర్తికి మొదటి సినిమా. ఇక మహేష్ బాబు సినిమాతో ప్రస్తుతం కీర్తి సురేష్ డైరీ ఫుల్ అయిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: