అనుపమ పరమేశ్వరన్ .. అందానికి అందం అభినయానికి అభినయం రెండూ కావాల్సినంతగా ఉన్నాయి. కాని సినిమాలలో అవకాశాలే లేవు. అందుకు కారణం ఏంటో కూడా ఎవరీకి అంతు చిక్కడం లేదు. అనుపమ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీని ఆకట్టుకుంది. ఆ సినిమాతోనే అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలు వరసగా వచ్చి ఒళ్ళో పడ్డాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' సినిమాలో నటించిన అనుపమా పరమేశ్వరన్ ఆ తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ సరసన 'అ ఆ' సినిమాలో నటించింది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అని కూడ చెప్పుకోలేనటువంటి పాత్ర చేసింది. కాని శతమానం భవతి సినిమాతో హిట్ అందుకుంది.

 

ఆ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలలో నటించింది. ఈ సినిమాలన్ని యావరేజ్ గా ఆడాయి. ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ కాకపోవడంతో అనుపమ కి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ దక్కలేదు. ఇక దిల్ రాజు బ్యానర్ లో రాం హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమకోసమే సినిమాలో నటించింది. వాస్తవంగా ఈ సినిమా మీద అనుపమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాని ఆ ఆశలన్ని ఆవిరైపోయాయి. దాంతో అనుపమ కి తెలుగులో సినిమాలు లేకుండా పోయాయి. 

 

ఇక బెల్లం కొండ శ్రీనివాస్  హీరోగా 'రాక్షసుడు' సినిమాతో విజయం సాధించినప్పటికీ తర్వాత అవకాశాలు రాకపోవడంతో కాస్త గ్యాప్ వచ్చి రేస్ లో వెనుకబడిపోయింది. దానికితోడు రష్మిక మందన్న పూజా హెగ్డే ల దూకుడుతో అనుపమ కి కాస్త దెబ్బ పడింది. అయితే రీసెంటుగా నిఖిల్ హీరోగా 'కార్తికేయ-2' సినిమాలో హీరోయిన్ గా ఛాన్ వచ్చిందని తాజా సమాచారం. కార్తికేయ -2 కి డైరెక్టర్ చందు మొండేటి.

 

డైరెక్టర్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన 'ప్రేమమ్' సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. అందుకే చందు మొండేటి ని ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగిందట. దాంతో అనుపమ కోసం చందు మొండేటి .. హీరో నిఖిల్ ని నిర్మాతలను ఒప్పించాడని తెలుస్తోంది. మొత్తానికి ఛాన్స్ కోసం అనుపమ బాగానే డైరెక్టర్ ని కాకా పట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: