మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా స్థంభించిపోయింది. మన దేశంలొనూ వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు ఆగిపోయాయి. ప్రధాని 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించటంతో దేశ ప్రజానీకమంతా ఇంటికే పరిమితమయ్యారు. సాధారణ ప్రజలు మాత్రమే కాదు. నాయకులు, సెలబ్రిటీలు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.
ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు తాము క్వారెంటైన్లో ఏం చేస్తున్నారో.. అభిమానులతో పంచుకుంటున్నారు. వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ సమయంలో బాలీవుడ్ హాట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్లు ఒకే ఇంట్లో ఐసోలేషన్లో ఉంటున్నారు. తాజాగా ఈ ఇద్దరు రణబీర్ పెంపుడు కుర్ర లియోనల్ ను తీసుకొని వాకింగ్ కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
అయితే ఈ వీడియోపై నెటిజెన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. ప్రపంచమంతా భయంతో వణికిపోతుంటే మీరు సరదాగా వాకింగ్ చేస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు. అభిమానులకు బాధ్యతగా ఉండాలని చెప్పాల్సిన సెలబ్రిటీలే ఇలా చేయటం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.