‘జాను’ ఘోర పరాజయంతో శర్వానంద్ మార్కెట్ బాగా దెబ్బతిన్నది.  దీనికితోడు ఆ మధ్య జరిగిన యాక్సిడెంట్ వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలు ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో శర్వానంద్ మళ్ళీ అమెరికాకు వెళ్ళి మరొకసారి ఆపరేషన్ చేయించుకోవాలి అన్న ఆలోచనలు చేసాడు. ఈలోగా కరోనా సమస్యలు ముదిరిపోవడంతో శర్వానంద్ ప్లాన్ ముందుకు నడవలేదు. 
 

ఎవరైనా ఏదైనా మంచి విషయం చెపితే అది ప్ర‌మాదం ముంచుకొచ్చిన‌పుడే ఆ సలహా విలువ అందరికి తెలుస్తుంది అని అంటారు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో గతంలో శర్వానంద్ ‘మహానుభావుడు’ మూవీలో చెప్పిన విషయాలకు ఇప్పుడు విలువ ఏర్పడింది. వ‌్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటిద్దాం చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కుందాం సామాజిక దూరం పాటిద్దాం అంటూ శర్వానంద్ పాత్ర ‘మహానుభావుడు’ మూవీలో చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచం అంతా పాటిస్తూ వాటి గురించి పెద్ద ఎత్తున ప్రచారం కూడ చేస్తున్నారు. 


అయితే ‘మహానుభావుడు’ సినిమాను అప్పట్లో తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు. అంతేకాదు అంత మితిమీరిన శుభ్రత ఎవరికీ ఉంటుంది అంటూ అవహేళన కూడ చేసారు. ఓవర్‌ క్లీనింగ్‌ డిజార్డర్‌ తో మారుతి క్రియేట్ చేసిన శర్వానంద్ పాత్రకు చెప్పుకోతగ్గ స్థాయిలో గుర్తింపు రాలేదు.  అయితే తాను త‌న సినిమాలో ఏవైతే జాగ్ర‌త్త‌లు చెప్పాడో ఈనాడు ప్రపంచం అంతా తన పాత్రను గుర్తుకు చేసుకుంటోంది అంటూ శ‌ర్వానంద్ సోష‌ల్ మీడియా వేదిక‌గా గుర్తు చేశాడు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్టూన్‌ రూపంలో శ‌ర్వానంద్ తెలిపాడు. 


మన ప్రపంచం మన దేశం మన ప్రజల కోసం ప్రతీ ఒక్కరు ‘మహానుభావుడు’ గా మారాలి మారదాం’ అంటూ శర్వానంద్ చేసాడు. ప్రస్తుతం శర్వానంద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్ప‌ట్లో ‘వ్యక్తిగత పరిశుభ్రత గురించి ‘మహానుభావుడు’ చెప్పాడు. అప్పుడు నవ్వుకున్నాం ఇప్పుడు పాటిద్దాం’ అంటూ నెటిజన్లు శర్వానంద్ కు పూర్తి మద్దతు చెపుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: