అల్లుడు శీను సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ సినిమాతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించింది. బెల్లంకొండ సురేష్ బాబు తనయుడు అయిన శ్రీనివాస్ కి అల్లుడు శీను తర్వాత నటించిన ఏ సినిమా కూడా విజయాన్ని తెచ్చిపెట్టలేదు. మొదట్లో మాస్ హీరో అనిపించుకుందామని కమర్షియల్ చిత్రాల్లో నటించినప్పటికీ విజయం దరికి రాలేదు.

 

 

ఇటీవల బెల్లంకొండకి రాక్షసుడు రూపంలో విజయం వచ్చింది. తమిళ చిత్రమైన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతో రమేష వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఫుల్ టు ఫుల్ కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందిట.

 


ఆ సాంగ్ లో బెల్లంకొండతో కలిసి డాన్స్ చేయడానికి ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ని అడిగారట. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో దిమాక్ కరాబ్ పాటకి నిధి వేసిన స్టెప్పులు బాగా పేలాయి. అందువల్ల అల్లుడు అదుర్స్ లోని స్పెషల్ సాంగ్ కి నిధి అయితే బాగుంటుందని అనుకున్నారట. ఈ మేరకు ఆమెని సంప్రదించగా.. అరవై లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. కేవలం నాలుగు నిమిషాల్ పాటకి అంత డిమాండ్ చేయడంతో షాక్ అయ్యారట.

 


కాజల్,తమన్నా, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు అడిగారంటే ఓ అర్థం ఉంటుంది గానీ ఇప్పుడిపుడే ఎదుగుతున్న నిధి అగర్వాల్ ఓ రేంజ్ లో డిమాండ్ చేయడంతో షాక్ తిన్నారట. ప్రస్తుతం ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవాలని చూస్తున్నారట. అవకాశాలే లేని ప్రస్తుత సమయంలో నిధి అంతలా డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఆమెకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: