ఒక్లాహామాలో నివాసముండే ప్రముఖ గాయకుడు జోయ్‌ డిఫ్ఫీ 1990లో సంచలనాలు సృష్టించాడు. పిక్‌ అప్‌ మేన్‌, ప్రాప్‌ మీ అప్‌ బిసైడ్ ద జ్యూక్ బాక్స్, జాన్‌ డేర్‌ గ్రీన్‌ లాంటి బ్లాక్ బస్టర్‌ ఆల్బమ్స్‌తో ఆయనకు భారీ ఫాలోయింగ్ వచ్చింది. గ్రామీ అవార్డును సైతం అందుకున్న స్టార్ సింగర్‌ జోయ్‌ డిఫ్ఫీ కరోనాతో మృతి చెందాడు. ఆయన వయసు 61 సంవత్సరాలు కావటంతో చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదు..


ఈ విషయాన్ని ఆయన ఫ్యామిలీ ఫేస్‌ బుక్‌ ద్వారా కన్‌ఫార్మ్‌ చేసింది. ఆదివారం జోయ్‌ మరణించినట్టుగా వారు అధికారికంగా వెల్లడించారు. చనిపోవడానికి రెండు రోజుల ముందే జోయ్ తనకు కరోనా వైరస్ సోకినట్టుగా ఫేస్‌ బుక్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. అంతేకాదు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా అన్న ఆయన త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానన్నారు. `ఇప్పుడు నేను నా కుటుంబం అందరికీ దూరంగా ఉంటున్నాం. నా ఫ్యాన్స్‌ ప్రజలు అంతా ఈ కష్ట కాలంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా` అన్నారు.

 

అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశ వ్యాప్తంగా దాదాపు లక్షా 40 వేల మంది వైరస్ సోకినట్టుగా అంచన వేస్తుండగా 3 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్చల విషయంలో కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. మన దేశంలో కరోనా ప్రభావం గట్టిగానే ఉంది. ఇప్పటికే మన దేశంలో 1000కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 27 మంది ప్రాణాలు విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: