టాలీవుడ్ దేశంలోనే అత్యంత ఎక్కువగా సినిమాలు నిర్మించే రంగం. బాలీవుడ్ తో పోటీ పడుతూ వరల్డ్ వైడ్ మూవీస్ ని కూడా తీయగలమని బాహుబలి ద్వారా సత్తా చాటుకుంది. ఇక్కడ మేకర్లకు కొదవ లేదు. మేధస్సుకు అంతకంటే కొదవ లేదు. అన్నీ ఉన్న టాలీవుడ్లో కొన్ని విషయాల్లో మాత్రం ఎందుకో చిన్న చూపు ఉంది.

 

అదేనండీ. మన వాళ్ళు అంటేనే చాలు ఎక్కడికో పారిపోతారు. మన తెలుగు వారిని అసలు ఎంకరేజ్ చేయరు. మన టాలెంట్ కి పెద్ద పీట కాదు కానీ చిన్న పీట కూడా వేయరు. దాంతో తెలుగమ్మాయిలు వేరే చోటకు వెళ్ళి వెలుగులు పంచాల్సివస్తోంది. ఉదాహరణకు అంజలిని తీసుకుంటే అచ్చ తెలుగు అమ్మడు.

 

ఆమెను మొదట కోలీవుడ్ గుర్తించింది.  ఆ తరువాతనే టాలీవుడ్ చాన్సులు ఇచ్చింది. అయినా కూడా ఆమె నటనను పూర్తి స్థాయిలో  ఉపయోగించుకోలేకపోయిందనే చెప్పాలి. కేవలం గ్లామర్ ఉంటే చాలు రీళ్ళు తిప్పేస్తామని అనుకోవడం వల్లనే బాలీవుడ్ భామల వెంట పడుతున్నారనుకోవాలి.

 

గత పది నుంచి పదిహేనేళ్ళ హిస్టరీ తీసుకుంటే టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా రాణించిన వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అదే టైంలో మన అందాలు మాత్రం మసకబారిపోయాయి. ఇపుడు తెలుగింటి అమ్మాయిగా ఉన్న ఈషా రెబ్బ వంటి వారి సీన్ కూడా ఇంతే.

 

ఒకటీ అరా సినిమాలు వస్తున్నా అవన్నీ అప్ కమింగ్ హీరోలవే కావడంతో ఈషారెబ్బా నిరాశపడుతోంది. సుమంత్ తో చేసిన సుబ్రమణ్యపురంలో మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నా టాలీవుడ్ పట్టనట్లుగా ఉంది.

 

ఈ అమ్మడికి ఈ మధ్య మెగా క్యాంప్ నుంచి పిలుపు వచ్చిందని టాక్ బాగా స్ప్రెడ్ అయింది. కానీ ఎందుకో అది అలా ఆగిపోయింది. మరి సీనియర్ హీరోలు ఉన్నారు. యంగ్ స్టర్స్ ఉన్నారు. వీరి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నా తన పంట పండినట్లేనని ఈషా ఆశగా ఎదురుచూస్తోంది. 

 

కానీ నిరాశే ఆమె ఇంటి గుమ్మం ముంది కాపలా ఉంటోందిట. మరి ఈషా లాంటి  తెలుగు అమ్మాయిలు ఎంతో మంది టాలీవుడ్ మాది అనుకుంటున్నారు. కానీ వారిని దూరం పెడుతున్నారు. అంత పాపం వీరేం చేశారో మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: