పూజాహెగ్డే... ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున గురొచ్చే పేరు. నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కాల్షీట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. వరుస విజయాలు పలకరించడంతో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

 

'అరవింద సమేత' 'మహర్షి' చిత్రాల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పూజాహెగ్డే.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అంతేగాక అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

 

అయితే ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి మరో వార్త వినబడుతోంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు పూజ మీద కోలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడిందట. తాజాగా అమ్మడు స్టార్ యాక్టర్ సూర్య సరసన అవకాశం కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హరి చాలాకాలం టైం తీసుకొని సూర్య హీరోగా 'అరువ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సూర్య - హరి ల కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అభిమానులలో సందడే ఎందుకంటే వాళ్లిద్దరూ కలిసి చాలా రికార్డులు బద్దలు కొట్టారు. సింగం సిరీస్ గురించి అందరికి తెలిసిందే. పూజా ఈ సినిమాకు పచ్చ జెండా ఊపారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: