కరోనా చాలా మంది ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తుంటే కొంత మంది మాత్రం ఇది మంచే చేస్తోంది. ఇటీవల మాజీ భార్యా భర్తలు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ లు క్వారెంటైన్ కారణంగా ఒకే ఇంట్లో కలిసుంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఫ్యూచర్ కపుల్ కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గా మారింది.
బాలీవుడ్ హాట్ జోడి టైగర్ ష్రాప్, దిశా పటాని ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారట. భాగీ 2 సినిమాలో కలిసి నటించిన జంట మధ్య అప్పటి నుంచే సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళిద్దరు మేం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పిన ఆ వార్తలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా లాక్ డౌన్ సందర్భంగా ఆ అనుమానులకు మరింత బలాన్ని వార్త ఒకటి బయటకు వచ్చింది.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సాధారణ ప్రజలతో పాటు సినీ తారలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తమ వర్క్ అవుట్ వీడియోలను షేర్ చేస్తున్నారు. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా తన వర్క్ అవుట్ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. హోం క్వారెంటైన్లో ఉన్న టైగర్ తన ఇంటి బాల్కనిలో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశాడు.
ఆ తరువాత రోజే అదే ప్లేస్ లో నిలుచొని దిగిన ఫోటోను గ్లామర్ క్వీన్ దిశా పటాని షేర్ చేసింది. దీంతో లాక్ డౌన్లో ఈ జంట కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. భాగీ 3 సినిమా తరువాత తదుపరి చిత్రాన్ని ఇంకా టైగర్ ప్రారంభించలేదు. దిశ మాత్రం కే టినా, రాధే సినిమాలతో బిజీగా ఉంది.
View this post on InstagramMy mom never let us play in the house when we were kids, guess this time she has no choice 😁 Tell me what you guys are doing to #StaySafeStayStrong by tagging me and @asicsindia on it. #StayHome #ASICS #ASICSIN #IMoveMe