మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మంచు విష్ణు. 'ఢీ', 'దేనికైనా రెడీ', దూసుకెళ్తా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం భారీ ఐటీ స్కాం నేపథ్యంలో రూపొందుతున్న 'మోసగాళ్లు' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా మీడియాకు కూడా దూరంగానే ఉన్న విష్ణు ఈ మధ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టాడు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ వస్తే కచ్చితంగా మంచి సినిమాతోనే రావాలని.. ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేస్తున్నపుడే అవి పోతాయని తెలిసినా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అంతేకాకుండా తమ్ముడు మనోజ్ విడాకుల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో స్పందించాడు విష్ణు.

 

తమ్ముడు మనోజ్ భార్యతో విడిపోతున్నాడని తెలిసినపుడు తామేం మాట్లాడలేదని.. అది అతడి జీవితమని, అయితే ఏదేమైనా కూడా తమ్ముడు విడాకులు తీసుకున్న తర్వాత తాను అతడికి చెప్పిన ఒకే ఒక్క మాట.. టేక్ యువర్ ఓన్ టైమ్ అని మాత్రమే అన్నాడు విష్ణు. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కన్‌ఫ్యూజన్‌లోనో, డిప్రెషన్‌లోనే ఉంటారు.. అలాంటి సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని చెబుతున్నాడు విష్ణు. ఆ ఉద్దేశ్యంతోనే మనోజ్‌కు అలా చెప్పానని గుర్తు చేసుకున్నాడు విష్ణు. ఆ తర్వాత మనోజ్ మళ్లీ మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పట్టినా కూడా ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేసాడని చెప్పాడు. ఇక తాము ముగ్గురం మోహన్ బాబుకు సరైన వారసులేనా అనే ప్రశ్న వచ్చినపుడు కూడా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నకు సమాధానం కాలమే నిర్ణయిస్తుందని చెప్పాడు విష్ణు. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి కూడా చాలానే చెప్పాడు ఈ హీరో. త్వరలోనే మోసగాళ్లు సినిమాతో పాటు భక్త కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విష్ణు. ఈ చిత్రాల ద్వారా మంచు వారబ్బాయి పుంజుకుంటాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: