మోహన్ బాబు నట వారసులుగా తెలుగు సినిమాల్లో విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ తనదైన డైలాగ్ డిక్షన్ తో ఓ అటెన్షన్ క్రియేట్ చేస్తూంటుంది. పలు వేదికలపై ఆమె తెలుగు మాట్లాడే తీరు కామెడీ అయిపోయింది. లక్ష్మీ మాట్లాడినట్టు ఉన్న మాటలను టిక్ టాక్ లో పేరడీ చేసారు కొందరు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా వైరల్ గా మార్చేసింది రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీ తమ్ముడు మంచు మనోజ్ కావడం విశేషం.

 

 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వివాదాల వీరుడు ఆర్జీవీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఓ చిన్నారిని తన తల్లి.. ఒంటికి బలమొస్తది.. మిల్క్ తాగుతావా ‘మిలుకు’ అని పలుకుతుంది. దీంతో ఆ చిన్నారి.. మిలుకు కాదు.. మిల్క్.. ఎల్.. కె అక్షరాలు రెండూ ఇలా అతుక్కోవాలన్న మాట’ అంటూ చేసిన పేరడీ నెట్టింట్లో పేలిపోయింది. ఈ వీడియోను.. ‘కరోనా టైమ్ బ్రేక్ నిస్తూ ఈ చిన్నారి ఎవరిని ఇమిటేట్ చేసిందో చెప్పగలరా?’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి మంచు లక్ష్మీ తమ్ముడు మంచు మనోజ్ రిప్లై ఇస్తూ.. ‘ఇంకెవరు.. మా లచ్చక్కే..! అమ్మో.. అయిపోయాను.. ఎక్కడికీ పారిపోలేం కూడా’ అంటూ రిప్లై ట్వీట్ చేశాడు.

 

 

ప్రస్తుతం ఈ కన్వర్సేషన్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లను విపరితంగా ఆకర్షిస్తున్న ఈ విడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంత స్పోర్టివ్ గా ఎలా తీసుకోగలుగుతున్నావ్’, ‘పారిపోకు భయ్యా.. ప్రస్తుతం పరిస్థితులు బాలేదు’ అంటూ రిప్లై ఇస్తున్నారు. మరి.. తమ్ముడి రిప్లైతో ఫన్ అయిపోయిన ఈ వీడియోపై లక్ష్మీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: