కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ వైరస్ నీ నియంత్రించ లేక పోతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా దేశంలో పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో అమెరికా దేశం భూమిమీద ఉంటుందో లేదో అన్న రీతిలో సిచువేషన్ ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు అమెరికా దేశంలో నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం అదేవిధంగా దేశంలో ప్రజల మధ్య గొడవలు భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో హీరోయిన్ శృతి హాసన్ కోసం చాలామంది ఎగబడుతున్నారు. పూర్తి విషయంలోకి వెళితే కొన్ని సంవత్సరాల క్రితం తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ మరియు హీరో సూర్య కాంబినేషన్ లో వచ్చిన సినిమా `సెవెన్త్ సెన్స్`.

 

సినిమా ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కరోనా వైరస్ ని అప్పట్లో తలపించే విధంగా సినిమా తెరకెక్కించడం జరిగింది. చైనా దేశంలో పుట్టుకొచ్చిన వైరస్ కారణంగా సెవెంత్ సెన్స్ సినిమా లో భారత దేశం నాశనం చేయాలని విలన్ అనుకొంటారు. ఆ వైరస్ నాశనం చేయడానికి సినిమాలో హీరోయిన్ సైంటిస్ట్ జన్యు పరిశోధకురాలైన శృతిహాసన్  బోధిధర్మని తీసుకురావడం ఒకటే మార్గమని తెలుసుకుంటుంది. ఈ క్రమంలోనే అదే వంశానికి చెందిన హీరో కళ్యాణి కనుగొని అతనిని మైమరిపించే విధంగా నటించి అతనిలో ఉన్న బ్లడ్ నీ జన్యు పరిణామ క్రమం జరిపి వందేళ్ల కిందటి బోధిధర్మని మళ్లీ తీసుకొచ్చి.. వైర‌స్‌ను నాశ‌నం చేసేలా చేస్తుంది.

 

ముమ్మాటికీ ప్రస్తుత పరిస్థితులు సెవెంత్ సెన్స్ సినిమాలో ఉన్న సన్నివేశాలు రెండు ఒకే లాగా ఉంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వాళ్ల ఇంటికి పరిమితమైన చాలామంది ఈ సినిమా చూసి శృతిహాసన్ కోసం ఎగబడుతున్నారు. ఇంట్లో ఉన్న మమ్మల్ని విడిపించడానికి బోధిధర్మని మళ్లీ తీసుకురమ్మంటూ నెటిజన్లందరూ శ్రుతికి మెసేజ్‌లు పెడుతున్నారట. సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: