ఒక సినిమా చెయ్యాలంటే ఒక్కో హీరోయిన్ రెమ్యూనరేషన్ ఆకాశన్నంటుకునేంత రేంజ్లో ఉంటాయి. ఒక సినిమాలో నటించాలంటే కనీసం ఒకొక్కరు రెండు, మూడు కోట్లు తీసుకునే హీరోయిన్లు కూడా ఉంటారు. మరికొంత మంది అయితే కేవలం గెస్ట్ పాత్రకే కోట్లు తీసుకునే వారు కూడా ఉంటారు. ఇక కొన్ని సినిమాల్లో అయితే ఒక్క స్పెషల్ సాంగ్లో నటించినందుకే కొన్ని కోట్లు తీసుకునే తారమణిలు కూడా లేకపోలేరు. మరి అంతంత డిమాండ్ చేస్తూ తీసుకునే వీళ్ళు. కష్టకాలంలో మాత్రం ఎందుకు సాయం చెయ్యడానికి ముందుకు రారు అంటూ చాలా మంది అంటున్నారు.
ప్రస్తుతం క్రేజ్లో ఉన్న హీరోయిన్లు రష్మిక మండన్న ఇటీవలె మహేష్ చిత్రంలో నటించి మంచి క్రేజ్ని సంపాదించింది ఈ భామ. మరి మహేష్తో కలిసి నటించిందంటే ఈమె తక్కువేమి తీసుకోనుండదు కదా. అలాగే పూజా హెగ్డే బన్నీ సరసన అలవైకుంఠపురంలో నటించింది. అంతేకాక ప్రస్తుతం ప్రభాస్ జాన్ చిత్రంలో..అలాగే మరో మూడు చిత్రాల్లో నటిస్తుంది. ఈ భామ చేతినిండా సినిమాలే అంతే కాక మరో కోలీవుడ్ సినిమాకి కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఆల్రెడీ బాలీవుడ్లో కూడా అగ్రహీరోల సరసన నటించింది. అందులోనూ ఈ భామ రెమ్యూనరేషన్ ఈ మధ్య బాగా పెంచేసినట్టు సమాచారం. మరి ఎంత పెంచినా పూజానే కావాలి అనుకుని నిర్మాతలందరూ ఈమెనే ఎక్కువగా తీసుకుంటున్నారు.
ఇక రాశీఖన్నీ ఇటీవలె ప్రతి రోజు పండగే చిత్రంలో సాయి తేజ్ సరసన నటించింది. గీతాఆర్ట్స్ బ్యానర్ కాబట్టి కాస్త ఎక్కువగానే ముట్టి ఉంటది. ప్రస్తుతం కాజల్ ఆగర్వాల్ చిరు, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో ఈమె నటించనున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రం కోసం ఈ భామ తను రెగులర్గా తీసుకునేదాని కంటే కాస్త ఎక్కువగానే డిమాండ్ చేసిందట. అయినప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉండడంతో కాజల్ ఎంత డిమాండ్ చేసినప్పటికీ తననే ఓకే చేసినట్లు సమాచారం. ఇక సమంత, తమన్నా, నభానటేష్ ఇలా టాలీవుడ్ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి. ఎవ్వరూ కూడా ఈ కరోనా ఎఫెక్ట్తో సహాయనిధికి సాయం చెయ్యలేదు. కేవలం ఒక్క లావణ్య త్రిమాఠి మాత్రమే ఒక లక్షరూపాయలు విరాళంగా ఇచ్చింది.