వాస్తవానికి గత రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఇక ప్రస్తుతం దాని అనంతరం అర్జున్ నటిస్తున్న తాజా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 

IHG

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా గంధపు చక్కల నేపథ్యంలో శేషాచలం అడవుల్లో ఎక్కువగా సాగుతుందని, అలానే ఈ సినిమాలో హీరో అర్జున్, హీరోయిన్ రష్మిక ఇద్దరూ కూడా పక్కా మాస్ లుక్ లో కనపడనున్నారని టాక్. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం కరోనా దెబ్బతో బ్రేక్ పడింది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కాసేపటి క్రితం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ అయిందని వార్తలు షికారు చేయడంతో పాటు ఒక పోస్టర్ కూడా బయటకు వచ్చింది. 

 

 

పోస్టర్ లో ఊర మాస్ లుక్ లో ఉన్న బన్నీ, గుబురు గడ్డంతో దర్శనం ఇచ్చారు. కాగా ఆ పోస్టర్ కాసేపటికే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా సంచలనం సృష్టించడంతో అందరూ అది అఫీషియల్ పోస్టర్ అని భావించారు. ఆ ఘటనతో పోస్టర్ లీక్ అయిందని భయపడి కొంత తలలు పట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, ఎట్టకేలకు అది పూర్తిగా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని గ్రహించి, అఫీషియల్ పోస్టర్ అతి త్వరలో మీ ముందుకు వస్తుందని ఒక పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా నీరు గారిపోయారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇంతలా అదిరిపోతే ఒరిజినల్ పోస్టర్ ఇంకెంత అదరగొడుతుందో అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: