ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే మహేష్ బాబు 27వ సినిమా గురించే. ఈ సినిమాని గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కించబోతున్నట్టు తాజా సమాచారం. ఈ ప్రాజెక్ట్ త్వరలోనేనని అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయిందని తాజా సమాచారం. మహానటి, అజ్ఞాతవాసి సినిమాల తర్వాత కీర్తి సురేష్ మళ్ళీ తెలుగు సినిమా లో కనిపించలేదు. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాలో నటిస్తుంది. ఇక తాజాగా మహేష్ తో రూపొందబోయో సినిమాకి కీర్తి సురేష్ అయితే బాగుంటుందని పరుశురామ్ భావిస్తున్నాడట. 

 

అయితే ఈ విషయంలో కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారట. ఇండస్ట్రీలో చాలా సెంటిమెంట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిలో ఎక్కువగా నెగెటివ్ సెంటిమెంట్లే ఉంటాయి. అదే ఇప్పుడు కీర్తి సురేష్ గురించి బాగా వైరల్ అవుతోంది. మహేష్27 సినిమాకు కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేస్తున్నారన్న న్యూస్ బయటకు రావడంతో ఓ నెగెటివ్ సెంటిమెంట్ పై తీవ్రంగా చర్చ సాగుతోంది. అదే కీర్తి సురేష్ నటించిన స్టార్ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలాయన్న విషయం.

 

ధనుష్ తో 'తొడరి' అనే సినిమాలో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెలిసిందే. ఇక తమిళ హీరో విక్రమ్ తో 'సామి స్క్వేర్' చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అన్న పేరు తెచ్చుకుంది. కీర్తి నటించిన స్టార్ హీరో సినిమాల్లో హిట్ గా నిలిచింది ఒక్క 'సర్కార్' సినిమా మాత్రమే. ఈ సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ డిజాస్టర్లే. దీంతో కీర్తి నటించిన స్టార్ హీరోల సినిమాలకు నెగెటివ్ సెంటిమెంట్ మహేష్ బాబు సినిమాకి కంటిన్యూ అవుతుందేమో అన్న ఆలోచనలో ఉన్నారట ఫ్యాన్స్. వాస్తవంగా చూస్తే చాలా విషయాల్లో మహేష్ బాబు కి సెంటిమెంట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు కీర్తి కి ఓటేసి రాంగ్ స్టెప్ వేస్తారా అంటూ చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: