మళయాళ పరిశ్రమ నుండి వచ్చిన హీరోయిన్స్ కు తెలుగులో సూపర్ క్రేజ్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న భామలు తెలుగులో కూడా అదే ఫామ్ కొనసాగిస్తున్నారు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. అప్పటికే మళయాళ సినిమాల ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో కీర్తికి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మహానటి సినిమా తర్వాత కీర్తికి తిరుగులేదు అనుకున్నారు. 

 

అయితే ఎందుకో కీర్తి సురేష్ తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో అమ్మడికి మంచి క్రేజ్ ఉన్నా ఎందుకో ఇక్కడ సినిమాలను లైట్ తీసుకుంది. అయితే మళ్లీ ఏమనిపించిందో ఏమో కీర్తి ఇప్పుడు తెలుగులో కూడా వరుస  సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం మిస్ ఇండియా సినిమా చేస్తున్న కీర్తి సురేష్సినిమా తర్వాత నితిన్ హీరోగా వస్తున్నా రంగ్ దే సినిమాలో నటిస్తుంది. సినిమాలో అను పాత్రలో కనిపించనున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ చేశారు. అను పాత్రలో కీర్తి మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ఖాయమని చెప్పొచ్చు. 

 

క్యూట్ లుక్స్  తో ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాతో తెలుగులో మరింత క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా కాబట్టి సినిమా లవ్ స్టోరీగా రాబోతుందని చెప్పొచ్చు. భీష్మతో హిట్ అందుకున్న నితిన్ రంగ్ దే తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పరచింది. మరి సినిమాలో అమ్మడు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: