టీవీ యాంకర్ గా పరిచయమైన అనసూయ తన అందంతో మత్తెక్కించే చూపులతో మంచి ఫాలోయింగ్ ని ఏర్పర్చుకుంది. టీవీల్లో సూపర్ ఫామ్ లో ఉన్న అనసూయ అప్పుడప్పుదు సినిమాల్లోనూ కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలా సినిమాలే చేసిన ఆమెకు నటిగా గుర్తింపు వచ్చింది మాత్రం రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారానే. ఆ సినిమాలో ఆ పాత్రకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవార్డు కూడా దక్కించుకుంది.

 

అయితే ఆ పాత్ర ఇచ్చిన ఉత్సాహం, పేరుతో ఆమెకి మరో మంచి సినిమాలో అవకాశం వచ్చిండి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ అనే సినిమాలో అనసూయకి అవకాశం వచ్చింది. క్రిష్ణవంశీ నక్షత్రం సినిమా ఫ్లాప్ తర్వాత తీస్తున్న చిత్రం ఇది. గత కొన్ని రోజులుగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న క్రిష్ణవంశీ మొదటిసారి ఒక రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 

 

మరాఠీ లో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారు. ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికి వస్తే.. నాటకాలు వేసే ఓ రంగస్థల నటిగా నటించనుందట. 

 

రంగస్థలంపై నాటకాలు వేసే పాత్రలో అనసూయ నటించనుందట. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేక సాంగ్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందట. ఇది వరకు అనసూయకి స్పెషల్ సాంగ్స్ చేసిన అనుభవం ఉంది. సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రంలో ఆమె ఆడి పాడింది. మరి రంగమార్తాండలో రంగస్థలంపై చేస్తున్న అనసూయకి మరిన్ని అవకాశాలు తెప్పిస్తాయేమో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: