ఎక్కడ చుసిన ఎటు చూసిన ఒకటే మాట వినపడుతుంది.. అదే కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు దేశ దేశాలను కలపెట్టడమే కాకుండా ప్రపంచంలో అందరినీ నిద్రలేని రాత్రులను గడిపెలా చేస్తుంది .. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఒక్కటై కరోనా ను నియంత్రణ చేసున్నాయి..భారత ప్రభుత్వం ఈ కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంది.. కరోనా ప్రభావం ప్రజలను వారి జీవన శైలిని హతలకుతలం చేసేసింది.. 

 

 

 

ఈ మహమ్మారి కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 


ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వారి లోని కళలను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..

 

 

 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై జరుపుతున్న పోరాటానికి సినీ నటుడు నారా రోహిత్ మద్దతు ప్రకటించాడు. తన వంతుగా భారీ విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి,  రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.30 లక్షలు విరాళంగా ఇస్తానని తెలిపాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పది లక్షల రూపాయల చొప్పున ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: