లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావటంతో వారి కోసం ప్రభుత్వం అలనాటి సూపర్ హిట్ టెలివిజయ్ సిరీస్ రామానంద్ సాగర్ రామాయణ్ని రీ టెలికాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో రాముడి పాత్రతో ఫేమస్ అయ్యాడు ప్రముఖ నటుడు అరుణ్ గోవిల్. రీ టెలికాస్ట్ తో మరోసారి ఆయన గురించిన చర్చ మొదలైంది.
దీంతో ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ నేపథ్యంలో ఆయన రామాయణ్ రీ టెలికాస్ట్ ను చూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అరుణ్ గోవిల్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టీవీలో రామాయణంను చూస్తున్న ఫోటోను నెటిజెన్లు తెగ షేర్ చేస్తున్నారు.
ఇక రామాయణం విషయానికి వస్తే రామానంద్ సాగర్ స్వయంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన రామాయణ్ సీరియల్ దూరదర్శన్లో ప్రసారమైంది. ఈ సీరియల్లో అరుణ్ గోవిల్ తో పాటు దీపికా చిక్కాలియా, సునీల్ లహ్రీలు కీలక పాత్రల్లో నటించారు. తొలిసారిగా ఈ సీరియల్ 1987లో ప్రసారమైంది.