'రబ్ నే బనాదీ జోడి' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది అనుష్క శర్మ. క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. సాధారణంగా పెళ్ళయిన తరువాత హీరోయిన్లు కాస్త బ్రేక్ తీసుకుంటారు. కానీ అనుష్క మాత్రం ఇంకా బిజీ అయ్యిందనే చెప్పాలి. ఓ వైపు సినీ నిర్మాణం, మరోవైపు సినిమా, భర్త విరాట్ పనులు, క్లాత్ బిజినెస్ ఇలా బిజీబిజీగా ఉండే అనుష్కకి ఇటీవలి కాలంలో కాస్త విరామాన్ని తీసుకోవాలనుకుంటోందట. అయితే పిల్లల్ని కనడానికే అనుష్క బ్రేక్ తీసుకుంటోందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇటీవల ఆమె హాట్ కామెంట్స్ చేసింది.

 

ఈ విషయంలో చాలా ఊహాగానాలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. తల్లిని కావడానికే నేను విరామం కోరుకుంటున్నానని చాలా మంది అన్నారు. అవన్నీ నిజం కావు. నేను సినిమాలు చేయడం లేదంటే నాకు నచ్చిన కథ దొరకడం లేదు. ఇప్పుడు డబ్బుల కోసమని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవలసిన అవసరం లేదు. మొదటి నుంచీ కూడా డబ్బుల కోసమే సినిమాలు చేయలేదు. నాకు నచ్చిన వ్యాపకం నటన. అందుకే సినిమాల్లోకి వచ్చాను. అంతే తప్ప బోలెడు సంపాదించాలన్న కోరిక లేదు. సినిమాలతో పాటు నాకు బోలెడు వ్యాపకాలున్నాయి. వాటి కోసం సమయం కేటాయిస్తున్నాను. నచ్చిన కథ దొరికితే నేను నటించడమే కాదు, నిర్మించడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. త్వరలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాను. పిల్లల్ని కనడానికే విరామం తీసుకోనవసరం లేదని నా అభిప్రాయం. నటిస్తూ కూడా పిల్లల్ని ప్లాన్‌ చేసుకోవచ్చు. నేను పిల్లల్ని కనడానికి ఇంకా సమయముంది. అయినా ఎప్పుడు పిల్లల్ని కనాలన్నది నా వ్యక్తిగతం. ఆ విషయంలో ఇతరులకు ఆసక్తి అవసరం లేదని అనుష్క శర్మ తెలిపింది. అనుష్క శర్మ గతేడాది జీరో చిత్రంలో కనపడగా, ప్రస్తుతం అంగ్రేజీ మీడియం సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: