దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తుంది.  సామాన్యు లనుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా భయపెట్టిస్తుంది.  తాజాగా తన భార్య కాజోల్, కుమార్తె నైసా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ స్పష్టం చేశాడు. కాజోల్, నైసాలకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ మీడియాలో వార్తలు రావడంతో ఆయన  సోషల్ మాద్యం ద్వారా సృష్టించారు.  అయితే ఇదంతా అసత్య ప్రచారం అని నిరాధారమైనదని తెలిపారు. అజయ్ దేవగణ్, కాజోల్ పలు మూవీలో నటించారు. దిల్ క్యా కరే, ప్యార్ తో హోనా హీ థా, రాజూ చాచా, గూండారాజ్ తదితర మూవీలను చేశారు. 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు.

 

ఇప్పటి వరకు కరోనా సృష్టిస్తున్న కలకలం అంతా ఇంత కాదు.  కరోనా పట్టి పీడిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్ ’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారని..  కరోనా వైరస్ కారణంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ ఆగిపోయి ఇంటి పట్టునే ఉంటున్న జక్కన్న.. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్‌కు ఇంటి నుంచే వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు.

 

ఈ సందర్భంగా అజయ్ దేవగణ్‌తో పని చేసిన అనుభవాన్ని పంచుకున్నాడు. డ్రెస్ ఛేంజ్‌కు తప్పితే ఎప్పుడూ అజయ్ కారవాన్ ఉపయోగించడని.. ఎప్పుడూ సెట్లోనే ఉంటాడని.. చెట్ల కిందే భోజనం చేస్తాడని... తాము దుమ్ముపట్టిన వాతావరణంలో షూటింగ్ చేసినపుడు కూడా ఆయన కారవాన్ జోలికి వెళ్లకుండా కార్మికులతో కలిసి భోజనం చేశాడని రాజమౌళి తెలిపాడు.  మొదటి సారిగా తెలుగు తెరపై కనిపిస్తున్నారు. ఇటీవల అజయ్ దేవగణ్ నటించిన తానాజీ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: