రష్మిక అన్నీ నేర్చిన ముద్దు గుమ్మ. చేతిలో ఫ్రెష్ గా రెండు హిట్లు ఉన్నాయి. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ అనిపించుకుంది. ఆ తరువాత భీష్మ మూవీతో చెలరేగిపోయింది. దాంతో క్విక్ గానే ఒక హాట్ డెసిషన్ తీసుకుంది. అదిపుడు టాలీవుడ్ లో టాప్ టాపిక్ గా ఉంది.

 

రష్మిక ఇండస్ట్రీకి వచ్చింది చలో అనే మూవీతో. అది మినిమం బడ్జెట్ మూవీ. ఆ మూవీ సూపర్ సక్సెస్ కావడంతోనే అమ్మడు అందరి కళ్ళల్లో పడింది. ఆ తరువాత ఆమె గీతా గోవిందం మూవీతో ఓవర్ నైట్  స్టార్ డం సంపాదించింది. ఇపుడు మహేష్ బాబు వంటి హీరోలతో నటించిన తరువాత రష్మిక తన ఆలోచనలు మార్చుకుందిట.

 

ఇక చేస్తే స్టార్ హీరోలతోనే చేస్తానని అంటోందిట. ఇదే విషయాన్ని తన మేనేజర్లకు చెప్పేసిందంట. తన దగ్గరకు ఆఫర్లకు వచ్చే వారు భారీ ప్రొడ్యూసర్లు, టాప్ రేంజి హీరోలు అయితేనే మాటలు ఉంటాయని అంటొందిట.

 

 

అంటే మీడియం రేంజి హీరోలకు ఇది గట్టి షాక్ అనే చెపాలి. ఇపుడు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ మంది హీరోలు వారే  ఉన్నారు. కానీ రష్మిక తన ఫ్యూచర్ చూసుకుంటోందిట. దాంతో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలగాలంటే చిన్న హీరోల పక్కన అసలు కనిపించకూడదు అనుకుంటోందిట.

 

ఆమె ఇపుడు సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లుగా చెబుతున్నారు. అలాగే టాప్ హీరోలతో వరసగా  ఆమె సినిమాలు ఉండబోతున్నాయని అంటున్నారు. వరస హిట్లతో ఆమె పూజా హెగ్డే కి చాలంజి చేస్తోంది. ఇపుడు రష్మిక తీసుకున్న ఈ డెసిషన్ తో చిన్న హీరోలు ఆమె పక్కన నటించే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయారనే చెప్పాలి. మరి వారి ముచ్చట్లు తీరేది ఎలాగో కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: