టాలీవుడ్ లొో ఆ మద్య సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ నటించిన ‘ ఆర్ ఎక్స్ 100’ మూవీతో మంచి సక్సెోస్ అందుకున్నారు.  ఈ మూవీ మొదట బోల్డ్ కంటెంట్ అంటూ తెగ ప్రచారం జరిగింది. ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో విశేషాలు పంచుకున్నారు.  ఈ సినిమా కథ అంతా కూడా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.

 

ఆ పాత్రను తెలుగు హీరోయిన్లు   ఎవరైనా చేస్తే బాగుంటుందని భావించి, వాళ్లందరినీ సంప్రదించాను. కానీ వాళ్లెవరూ ఆసక్తిని చూపలేదు. దాంతో పాయల్ ను ఎంపిక చేసుకున్నాను.  కొన్ని రోజుల పాటు ఆమె కూడా ఏదో మొక్కుబడిగా షూటింగుకి వచ్చి వెళ్లేది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత కొంత మంది అభిప్రాయాలు మార్చుకున్నారు.  కాకపోతే ఈ మూవీలో హీరోయిన్ నెగిటీవ్ షేడ్స్ ఉందన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం హీరోయిన్లు ఈ విషయంపై కాంప్రమైజ్ కాలేకపోయారు.  ఇక అప్ కమింగ్ హీరోయిన్లు తమ కెరీర్ఇబ్బంది ఉంటుందని భావించి ఒకప్పుకోలేదు.  కానీ పాయల్ రాజ్ పూత్ మాత్రం అన్నింటికి సిద్దమైన తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. 

 

 ఏది ఏమైనా నటన ప్రాధాన్యత ఉన్న పాత్ర అందుకే పాయల్ కి మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.  ఈ పాత్ర గురించి ఆమెకు క్షుణ్ణంగా వివరించాను.. కొన్ని రోజుల షూటింగ్ కాస్త నిర్లక్ష్యంగా వచ్చేది.. ఓ రోజు  ఈ సినిమాకి మీ పాత్రనే కీలకం .. మీరు ఇలా చేస్తే మీ పాత్ర చెడిపోతుంది .. యూనిట్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది' అని చెప్పాను. అప్పటి నుంచే ఆమె పాత్రలో ఇన్వాల్వ్ కావడం మొదలు పెట్టింది. ఆ కారణంగానే ఆ పాత్ర అంతగా పండింది .. ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: