యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమానే కాదు చిన్న చిత్రాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని సినిమాలు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలోనే విదేశాలలో జరగాల్సిన షెడ్యూల్ ని అర్ధాంతరంగా నిలిపి వేసి చిత్ర బృందం ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా 'జిల్' సినిమాతో టాలీవుడ్ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 

 

ఇక ఈ చిత్రానికి ముందు  'జాన్' అనే పేరు పెట్టాలనుకున్నారు. కాని ఆ తరవాత ‘రాధే శ్యామ్’ అనే పేరు బయటకు వచ్చింది. ఈ రెండు టైటిల్స్ తో పాటు ‘ఓ డియర్’ అన్న టైటిల్ ని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉగాదికి ఫస్ట్ లుక్ గానీ టైటిల్ గానీ చిత్ర యూనిట్ రివీల్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కాని కరోనా ఎఫెక్ట్ వల్ల అది కూడా వాయిదా పడింది. ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలో మార్కెట్ సెట్ వేసి చిత్రీకరించి కరోనా నేపథ్యంలో ఇండియాకి తిరిగి వచ్చారు. విదేశాలలో తెరకెక్కించే కథ కావడంతో సినిమా మొత్తం అక్కడే షూటింగ్ నిర్వహించాలన్న ప్రణాళిక వేసుకున్నప్పటికి అది కుదరలేదు. ఇప్పటికే దాదాపు 30 శాతం షూటింగ్ అక్కడే జరిగింది. 

 

ఇప్పుడు కనోరా ఎఫెక్ట్ వల్ల విదేశాల్లో షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడం తో... మిగిలిన సినిమా కూడా ఇక్కడే పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. దీనికోసం ఇప్పుడు హైదరాబాద్ లో హాస్పిటల్ సెట్లు వేయడానికి సిద్ధమయ్యారట. హాస్పిటల్ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారట. ఇప్పుడు ఆ సన్నివేశాల్ని హైదరాబాద్ లో సెట్లు వేసి చిత్రీకరణ చేయబోతున్నారట. ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం పెద్ద సెట్లు నిర్మించారట. ఇప్పుడు ఆ సెట్స్  పక్కనే ఆసుపత్రి సెట్ కూడా వేయబోతున్నారని ఫ్రేష్ అప్‌డేట్. 'సాహో'భారీ ఫ్లాప్ గా మిగలడంతో ఎలాగైనా ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు ప్రభాస్.   

మరింత సమాచారం తెలుసుకోండి: