'అందాల రాక్షసి' సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమా హిట్టవడం తో తెలుగు సినిమాలలో వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంది. అయితే గత రెండేళ్ళుగా టాలీవుడ్  అవకాశాలు తగ్గడంతో ఈ అమ్మడి పనైపోయిందని అనుకున్నారంతా. లావణ్య త్రిపాఠి రీసెంట్ గా నటించిన 'అర్జున్ సురవరం' సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ ని దక్కించుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ ఆమె సొట్టబుగ్గలంటే తనకెంతో ఇష్టమని స్టేజీపైనే పొగడ్తలతో ముంచెత్తారు. 

 

దాంతో అప్పటి నుంచి లావణ్య త్రిపాఠి గురించి ఎప్పటికప్పుడు ఏదో న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఇక మెగాస్టార్ ను మెస్మరైజ్ చేసిన బ్యూటీ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో అవకాశం దక్కించుకొని అందరికీ షాకిచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్'లో లావణ్య త్రిపాఠి ప్రధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ పవన్ ప్లాష్ బ్యాక్లో వచ్చే కథలో పవన్ సరసన లావణ్య త్రిపాఠి కనిపించనుందని సమాచారం. ఈ మూవీలో ఇప్పటికే నివేథా థామస్ అంజలి అనన్యలు కీలక పాత్రలో నటిస్తున్నారు. 

 

తాజాగా లావణ్య త్రిపాఠి చేరడంతో 'వకీల్ సాబ్'కు మరింత గ్లామర్ యాడ్ అయిందని సమాచారం. అలాగే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న తాజా చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటి సాయిమంజ్రేకర్ ఒక హీరోయిన్ గా ఎంపికవ్వగా తాజాగా మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ఎంపికైంది. ఇలా ఒకేసారి బాబాయి-అబ్బాయిల తో సొట్టబుగ్గల సుందరీ లావణ్య త్రిపాఠి ఛాన్స్ దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  ఇక ఈ రెండు సినిమాలలో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా కూడా ఇక లావణ్య త్రిపాఠి స్టార్ తిరిగినట్టే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: