దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ కథనం సినిమా ఆర్ అర్ అర్ .. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ అమ్మడు అలియా భట్ పేరు  ముంబై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు అంత తొందరెందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు..కొందరు ఈ విషయం పై ఘాటుగానే స్పందిస్తున్నారు..వివరాల్లోకి వెళితే..

 

 

 

ముంబయిలో స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖుల కార్తిక్ ఆర్యన్, ఆలియా భట్, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, అనన్య పాండే తదితరులు వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అసలు బండారం బయటపడింది. ‘గల్లీ బాయ్’ సినిమాకు గానూ ఆలియాకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. అయితే షో ప్రారంభం అయ్యాక తీసుకోవాల్సిన అవార్డు ఆలియా షో ప్రారంభం కాకముందే తీసుకున్నారు.ఈ వార్త అప్పుడు బాగా ఫెమస్ అయింది. 

 

 

 


ఈ విషయం తెలుసుకున్న మీడియా వర్గాలు వెంటనే అక్కడికి చేరుకుని ఆలియా ఫొటోలు క్లిక్‌మనిపించాయి. దాంతో చేసేదేంలేక ఆలియా ఫొటోలకు పోజులిచ్చింది. ఆ సమయంలో తీసిన వీడియోను ప్రముఖ సెల్రబిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆలియాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆలియా అవార్డు తీసుకున్న విషయాన్ని షో ప్రారంభమైన రెండు గంటల తర్వాత టీవీలో ప్రసారం చేయాలని ఆలియా మేనేజర్ మీడియాను హెచ్చరించారట.

 

 


దాంతో దొరికిందే సందు అనుకుని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ ఆలియా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పోన్లే కనీసం ఈ పనైనా ఎవ్వరికీ తెలీకుండా చేస్తోంది. ఆమాత్రమైన సిగ్గు ఉన్నందుకు ఆనందిస్తున్నాను. దీన్నే అవార్డ్ ఫిక్సింగ్ అంటారు’ అని కామెంట్ చేశారు. అయితే ఆలియా ఇలా ఎందుకు చేశారో మాత్రం తెలియలేదు. మీడియాను హెచ్చరించి, అవార్డు తీసుకుని వెనక నుంచి వెళ్లిపోవడం కరెక్ట్‌ కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటుగా పలువురి నోట్లో ఈమె పేరు నానుతుంది..ఏ అవార్డు ఫంక్షన్ లో అయిన కూడా ఈ అమ్మడు అలానే చేయడం పై పెదవిరుస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: